Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Chevella: ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

Chevella: ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

పదవులన్నీ ఆ ఎమ్మెల్యే ఫ్యామిలీకేనా

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామిన భీమ్ భరత్ చేవెళ్ళ మండలం తలారం, దుద్దాగు, ఆలూరు గ్రామల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పామెన బీం భరత్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే యాదయ్యది కుటుంబ పాలన అన్నారు. ధరణి మోసాలతో రాష్ట ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎస్ సి రైజర్వుడ్ స్థానంలో అన్ని పదవులు ఆయన కుటుంబం అనుభవిస్తుందన్నారు.

- Advertisement -

తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అన్నారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి కార్యకర్తలకు అన్యాయం చేసిండన్నారు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ… అవకాశం కోసం పార్టీలు మారుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన అసైండ్ భూములు టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానేభూముల పక్కా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి చేవెళ్ళ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి మండల మహిళా అధ్యక్షులు సమత వెంకట్ రెడ్డి ముడిమ్యాల పీఎస్సీ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ గుప్తా మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జూకర్ అన్న గారి శ్రీకాంత్ రెడ్డి చేవెళ్ళ మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ ఓబీసీ మండల అధ్యక్షులు సూర్యాపేట శ్రీనివాస్ గౌడ్ ముడిమ్యాల మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్ ఎంపిటిసి గుండాల రాములు డిసిసి ఉపాధ్యక్షులు పడాల రాములు పిఎసిఎస్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు పాండు యాదవ్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీను చేవెళ్ళ వార్డు మెంబలు మల్ గారి మల్లారెడ్డి వీరమల్ల మల్లేష్ దుర్గప్రసాద్ తలారం మాణిక్యం తలారం సంజీవ తలారం నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News