Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Emmiganuru: నేతలన్న అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

Emmiganuru: నేతలన్న అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రచారం

వచ్చే ఎన్నికల్లో టీడీపీను గెలిపించాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కోరారు. స్థానిక 5 వ వార్డులో 3 వ రోజు మాజీ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని ఎన్నికల ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ పతకాలు ద్వారా వచ్చే లబ్ది వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీవీజేఅర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్రాగు, సాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే టిడిపిను గెలిపించాలని కోరారు. నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అంటూ కపట ప్రేమ చూపిస్తున్న జగన్ మాయ మాటలు నమ్మరాదని ఆయన కోరారు. టిడిపిను గెలిపించాలని అభ్యర్థించారు.

కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగస్వామి గౌడ్, టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, నేసే మల్లికార్జున, ముల్లా కలిముల్లా, సలాం, వీజీఏ దయాసాగర్, శాబీర్, వాల్మీకి రామకృష్ణ నాయుడు, మధుబాబు, కృష్ణ తేజ నాయుడు, నజీర్ అహ్మద్, రవి కుమార్, కటారి రాజేంద్ర, బోయ రంగన్న, దామ నరసింహులు, అంజి, సోమన్న, రంజిత్ కుమార్, నాగుర్ బాషా, డ్రైవర్ ఈరన్న, ఎరుకల శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News