Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Errabelli: అట్టర్ ప్లాప్ పార్టీ కాంగ్రెస్

Errabelli: అట్టర్ ప్లాప్ పార్టీ కాంగ్రెస్

టికెట్లు అమ్ముకునే పార్టీ చిత్తుగా ఓడిపోవటం ఖాయం

జనగామ జిల్లా బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి లతో కలిసి మీడియాతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అవుతుంది, డబ్బులకు టికెట్స్ అమ్మకుంటున్నరు అని కాంగ్రెస్ పార్టీ వాల్లే వాళ్లను విమర్శిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లు అమ్ముకుంటడు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతాండనీ మండిపడ్డారు. నీ లాగా మాకు రోత మాటలు రావు, నువ్వు తిమ్మిని బమ్మి చేస్తావనీ ఎద్దేవా చేశారు. గోడలకు పేయింటింగ్ లు వేసే వాడివి… నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు, నీ కుటుంబమేంది? నీ బతుకేందనీ విమర్శించారు. సంవత్సరానికి ఒక పార్టీ మారే బతుకు నీదనీ, కొడంగల్ లో చిత్తుగా ఓడిపోయావు, బ్రోకరు మాటలెందుకు, దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలువమని సవాల్ విసిరారు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందనీ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందనీ, 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ మెుత్తం పడిపోతదనీ జోష్యం చెప్పారు. ప్రజలు మిమ్నల్ని నమ్మే పరిస్థితి లేదనీ, పక్క రాష్ట్రాలలో 6 గ్యారెంటీలు ఇయ్యని మీరు ఇక్కడ ఇస్తా అంటే ప్రజలు ఎట్ల నమ్ముతరనీ ప్రశ్నించారు. ఒకప్పుడు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం అని రాజశేఖరరెడ్డి అన్నారనీ, ఏ ఒక్కటి చేయలేదన్నారు. 16న జరిగే సీఎం కెసిఆర్ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్న అని అన్నారు. పొన్నాల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం అని, అంత సీనియారిటీ గల వ్యక్తిని పట్టుకుని రేవంత్ రెడ్డి అంత గోరంగా తిట్టడం సరి కాదనీ హితవు పలికారు. దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న మనిషని, పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి నీచమైన మాటలను ఖండిస్తున్నానన్నారు. దందాలు చేసే బ్రోకర్ రేవంత్ రెడ్డి ఒక మంచి వ్యక్తి ని అలా అవమానించడం కరెక్టు కాదన్నారు. మంత్రి కేటీఆర్ ను విమర్శించడానికి రేవంత్ కు అర్హత లేదన్నారు. పెద్ద చదువులు చదువుకుని, అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం చేసిన వ్యక్తిని అవమానిస్తావా…? కెసిఆర్ పై మాట్లాడే అర్హత నీకు ఉందా..? జాగ్రత్తగా మాటలాడటం నేర్చుకో అని హెచ్చరించారు. జనగామ పట్టణంలో సీఎం కెసిఆర్ భారీ భహిరంగ సభ ఈ నెల 16 న మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం అవుతుందనీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న మెుదటి మీటింగ్ కి ప్రజలు పెద్ద ఎత్తున తరిలి వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు. కేసీఆర్ దయతో జనగామ జిల్లా అయిందనీ, అబివృద్ధి లో జిల్లా ముందు వరసలో ఉందనీ, జనగామను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యత మాది అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News