Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్Governor: ఇక దిగిపోతా అంటున్న మహా గవర్నర్

Governor: ఇక దిగిపోతా అంటున్న మహా గవర్నర్

గవర్నర్ బాధతల నుంచి తాను తప్పుకునేందుకు అనుమతివ్వాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. తన శేష జీవితాన్ని ప్రశాంతంగా చదువుకుంటూ, రాసుకుంటా.. కాలక్షేపం చేసుకుంటానని ఆయన పేర్కొనటం విశేషం. రాజ్ పాల్ లేదా రాజ్యపాల్ లేదా గవర్నర్ గా తాను ప్రజా సేవ చేసుకున్నానని కూడా ఆయన సోషల్ మీడియా పోస్టులో వివరించారు.

- Advertisement -

అత్యంత వివాదాస్పద గవర్నర్ గా కోష్యారికి అపప్రధ ఉంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఆయన తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది. 2019లో తెల్లవారు జామున ఫడ్నవిస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయించటం, జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే, శివాజీ వంటివారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇలా చాలానే ఉన్నాయి ఆయన కెరీర్ లో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News