Friday, July 5, 2024
Homeపాలిటిక్స్Hyd: బిజెపి ఆధ్వర్యంలో 'చలో ధర్నా చౌక్'

Hyd: బిజెపి ఆధ్వర్యంలో ‘చలో ధర్నా చౌక్’

బీఆర్ఎస్ హామీలపై చలో ధర్నా చౌక్

తెలంగాణలోని పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని నువ్వు కట్టిన ఇండ్లేవి అంటూ బీజేపీ నేతలు నినదించారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు, జిల్లా కేంద్ర మంత్రి వర్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, ఎన్నో హామీలతో మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణు గోపాల్ నిరసన చేపట్టిన కిషన్ రెడ్డి, ఎలక్షన్ మానేజ్మెంట్ కమిటి చైర్మన్ ఈటల రాజేందర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్ , జూకల్ ఎంపీటీసీ-శంషాబాద్ మండ బీజేవైఎం అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, మెండే కుమార్ యాదవ్, బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News