Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Hyd: మోడీ ఓ అబద్ధాలకోరు: దాసోజు

Hyd: మోడీ ఓ అబద్ధాలకోరు: దాసోజు

అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయ చేస్తోందని, ప్రధాని మోడీ ఓ అబద్ధాలకోరంటూ హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శ్రవణ్‌ మండిపడ్డారు.  ఎవరైనా నువ్వు ఏం చదివావు..నీ సర్టిఫికెట్ ఏది అంటే ఎవరైన వారి చదివిన చదువుకు తగ్గ సర్టిఫికెట్ ను చూపిస్తారు. కానీ ప్రధాని మోడీ మాత్రం నువ్వు ఏం చదివవు..నీ సర్టిఫికెట్ చూపించు అంటే మాత్రం చూపించడు. పైగా అడిగిన వాళ్లపై కేసులు పెడతారంటూ శ్రవణ్ ఆరోపించారు.

- Advertisement -

 BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గం ఆడికమేట్ డివిజన్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ నాయకత్వంలో డివిజన్ అధ్యక్షులు బాల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని సాయి కిరణ్ యాదవ్, ముఠా జై సింహ, కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News