Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Hyd: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ

Hyd: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ సంధించారు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ ప్రాంత భిడ్డగా కేంద్రమంత్రిగా ఉన్నాఆ భాద్యతలు మరిచి అడ్డగోలు చిల్లర విమర్శలకే కిషన్ రెడ్డి పరిమితమయ్యారు తప్ప ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలకోసం పనిచేయలేదని లేఖలో సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయినట్టుగానే నేడు కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణాకు ఒక్క రూపాయిని కూడా రాష్ట్రానికి తేలేక ఒక అసమర్థునిగా కిషన్ మిగిలిపోతున్నారని ఆయన మండిపడ్డారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిదులిస్తుంటే పట్టించుకోకుండా సిగ్గులేకుండా కిషన్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
కిషన్ రెడ్డి వంటివారి చేతగాని తనం తెలంగాణకు శాపంగా మారిందని లేఖలో మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిదుల్లో అన్యాయం,ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన వాటాలపై కేంద్రాన్ని అడగడం చేతకాదు..పకృతి వైపరిత్యాలకు కేంద్రం నుండి నిదులు తీసుకురావటానికి చేతకాలేదు కానీ అడ్డగోలు విమర్శలు, అబద్దపు కూతలు చేస్తూ అసమర్థుడిగా కేంద్రమంత్రి మిగిలిపోతున్నారన్నారు.

- Advertisement -

కిషన్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో మాట్లాడాలని సవాలు చేశారు. చేతనైతే తెలంగాణకు విపత్తు సాయం తెచ్చి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. కిషన్ వికృత రాజకీయ క్రీడలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి,ఈ ప్రాంత ప్రజల అవసరాలను విస్మరించి నిస్సిగ్గుగా చిల్లర రాజకీయాలను చేయటం హేయమైన చర్య అని భగ్గుమన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News