Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Hyd: యాదాద్రి స్థాయిలో భద్రాద్రి, వచ్చే ఎన్నికల్లో గెలిచాక భద్రాచలం

Hyd: యాదాద్రి స్థాయిలో భద్రాద్రి, వచ్చే ఎన్నికల్లో గెలిచాక భద్రాచలం

బీఆర్ఎస్ లో తిరిగి చేరిన తెల్లం వెంకట్రావు

కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం మన వెంకట్రావు గారికి నెల రోజుల్లోనే అర్థమైందని, పార్టీలో తిరిగి చేరుతున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఆయనతోపాటు ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందన్నారు కేటీఆర్.

- Advertisement -

ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదని కేటీఆర్ అన్నారు. ఒక్క వర్షాకాలంలోనే కోటి ఎకరాల జమీన్ లో పంటను తెలంగాణ ఈరోజు సాగు చేస్తుందని, తెలంగాణ మొత్తంగా భూమాత పచ్చ చీర కట్టుకున్నదా అన్న తీరుగా పంటలు పండిస్తున్నది  మన రైతాంగమని, ఒకప్పుడు మనం అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ… ఈరోజు కోటి ఎకరాల మాగానంగా మారింది. ఇది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందన్నారు.

మరి తెలంగాణలో నాలుగు లక్షల 50 వేలు ఎకరాల పోడుభూమి పట్టాలు ఇచ్చినట్లు ఛత్తీస్గడ్ల ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న చత్తీస్గడ్ లో రైతుబంధు రైతు బీమా ఉన్నదా, 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయ రంగానికి అక్కడ ఉన్నదా, పండించిన పంట మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం కొంటె మరి కాంగ్రెస్ చత్తీస్గడ్ లో  కొంటున్నదా అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రైతుబంధు వస్తది. మిషన్ భగీరథ నీళ్లు వస్తవి… ఆసరా పెన్షన్ వస్తది… కల్యాణ లక్ష్మి వస్తది… షాది ముబారక్ వస్తది. అవన్నీ జేబులో పెట్టుకొని కెసిఆర్ తిట్టడం.. విమర్శ చేయడం అలవాటుగా మారింది. కాంగ్రెస్ పార్టీకి… అందులోని నాయకులకి పదవులు రాకపోవడమే ప్రజల సమస్యగా చిత్రీకరిస్తే… ప్రజలు ఆదరించరన్న విషయం కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని, గిరిజనులకి 10% రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చి, గిరిజనులకు పంచాయతీలు ఏర్పాటు చేసి స్వయం పాలన అధికారం ఇచ్చి, రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది కాదా ఆలోచించాలన్నారు.

యాదాద్రి స్థాయికి తగ్గకుండా భద్రాద్రి రామాలయ అభివృద్ధిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారు. కచ్చితంగా ఆ బాధ్యత మేమే తీసుకుంటామని కేటీఆర్ చెప్పడం విశేషం. తిరిగి అధికారంలోకి రాగానే  భద్రాద్రి రాముడి గుడిని అద్భుతంగా పునర్నిర్మిస్తాం, ఎవరికీ ఈ అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు కేటీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News