Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Quthbullapur: కాంగ్రెస్ విజయభేరి యాత్ర సూపర్ సక్సెస్

Quthbullapur: కాంగ్రెస్ విజయభేరి యాత్ర సూపర్ సక్సెస్

కొలను హనుమంత రెడ్డి సైన్యంలో మరింత ఉత్సాహం

కాంగ్రెస్ విజయభేరి యాత్ర” కుత్బుల్లాపూర్ బహిరంగ సభ…సూపర్ సక్సెస్ కావటంతో స్థానిక కాంగ్రెస్ నేతల్లో మరింత హుషారు వచ్చింది. కుత్బుల్లాపూర్ లో జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతుందన్నారు.

- Advertisement -


కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇందుకు నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ పరిపాలనతో విసుగు చెందారని అన్నారు. కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్, గురువును మించిన శిష్యుడులా తయారయ్యాడని అన్నారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ఎటు చూసినా కబ్జాలు చేస్తూ, ప్రజలను పీడిస్తూన్నాడు అని అన్నారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News