Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Jagadish Reddy: తప్పుడు నిర్ణయంతో సెల్ఫ్ గోల్ చేసుకున్న గవర్నర్

Jagadish Reddy: తప్పుడు నిర్ణయంతో సెల్ఫ్ గోల్ చేసుకున్న గవర్నర్

రాజకీయాల నుంచి వచ్చి రాజకీయ నేతలకే పాఠాలా?

ఎమ్మెల్సీల తిరస్కరణపై గవర్నర్ తమిల్ సై చెబుతున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఎమ్మెల్సీల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్న గవర్నర్ సెల్ఫ్ గోల్ చెసుకుందని తెలిపారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బిజెపికి అధ్యకురాలుగా ఉన్నారన్నారు. పదవి ప్రకటన తరువాత పదవికి రాజీనామా చేసిన గవర్నర్ అయిన తమిల్ సై నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటా అనడం అర్దరహితం అన్నారు. బిజెపి నుండి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదు అన్నారు. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుందన్నారు. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News