Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Kale Yadayya: అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కే ఓటేయండి

Kale Yadayya: అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కే ఓటేయండి

సజ్జనపల్లిలో బీఆర్ఎస్లో చేరికలు

చేవెళ్ల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమాలే తమకు శ్రీరామ రక్ష అని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆదరించి అభిమానించి తనను గెలిపించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి, సజ్జనపల్లి, అప్పారెడ్డిగూడ ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆదరించి అభిమానించి తనను గెలిపించాలని కోరారు. సజ్జన్పల్లి గ్రామంలో సి.నర్సింహ్మరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, ముఖేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, యాదయ్య, నరేందర్, మిథుల్, ఎత్మార్పల్లి ప్రవీణ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో చేవెళ్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య మాట్లాడుతూ పది సంవత్సరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గుర్తించి తనను మూడవసారి గెలిపించి హ్యాట్రిక్ విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిరంతరం కృషి చేసే నాయకుడిగా మీ వెనువెంటే ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రంజేవంతు, సర్దార్ నగర్ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ రాహుఫ్, మాజీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, పిఏసిఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, కనకమామిడి సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ మర్రి రాంరెడ్డి, గ్రామ అధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి, బాలమల్లేష్, నవీన్, పురుషోత్తమ్ రెడ్డి, ఎంపీటీసీ ప్రభావతి గణేష్ రెడ్డి, నాయకులు రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు కొత్తపల్లి తిరుపతిరెడ్డి, సర్పంచ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాఘవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మగౌడ్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News