Friday, October 18, 2024
Homeపాలిటిక్స్KCR @ Mahabubabad: 10 ఏళ్లుగా ప్రజారాజ్యం నడుస్తోంది

KCR @ Mahabubabad: 10 ఏళ్లుగా ప్రజారాజ్యం నడుస్తోంది

సభకు ఇంతమందొచ్చారంటే గెలిచేది బీఆర్ఎస్ అని అర్థం

మహబూబాబాద్ ప్రజాశీర్వాద సభ – బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు

- Advertisement -

కాంగ్రేస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టువదలకుండా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి మహబూబాబాద్ జిల్లా అయింది. పట్టుబట్టి జిల్లా చేయించిన. అభివృది ఫలితాలు కన్పిస్తున్నాయి. అకేరు, మున్నేరు నదిపోడుతా నీళ్లు పుష్కలంగా వున్నాయి. అధ్బుతంగా పంటలు పండిస్తున్నారు. మహబూబాబాద్ లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి.

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి
రెండు ఎలక్షన్లలో శంకర్ నాయక్ ను గెలిపించనందుకు అభివృద్దిని చూస్తున్నారు.
మీ వుర్లకు పోయి నేను చెప్పినదాన్ని చర్చించండి.. నిజమెంటో తెలుసుకోండి.
మాకు పరిశ్రమలు రావాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలని కోరుతున్నారు.
మూడు గంటల కరెంటు సరిపోతుందా? కాదు 24 గంటలు కరెంటు వుండాలని ప్రజల స్పందన. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు సరఫరా లేదు. వాల్లు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నరు. నాడు ఎరువుల కోసం చెప్పులు లెన్లులో పెట్టినం.
నేడు పుష్కలంగా ఎరువుల లభ్యం. ధాన్యం అమ్మితే నేరుగా బ్యాంకు ఖాతాలో జమఅయితా వున్నాయి.

రైతు బందు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణితో లాబాలే వున్నాయి కానీ, నష్టాలు లేవు. మీ భూమి మీద మీకే అధికారం బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది.
ధరణి తీసెస్తే ఇబ్బందులు ఎదర్కొంటాం కథ మొదటికే వస్తుంది. ధరణిపొతే పైరవీ కారులు అధికారులు మళ్లా లంచాలు వ్యవహారం మొదటికొస్తాయి. నేడు నేరుగా మీ ఖాతాల్లోకి వస్తున్నాయి. బిఆర్ఎస్ సర్కార్ వస్తే ఎటువంటి పైరవీలకు ఆస్కారం వుండదు. పదేళ్ల నుంచి ప్రజారాజ్యం నడుస్తున్నది. 25 వేల ఎకరాలకు పొడు పట్టాలిచ్చినం. పోలీస్ కేసులు రద్దు చేసినం. రైతుబంధు, భీమ కూడా ఇచ్చినం.

ధరణితో పల్లెలు ప్రశాంతంగా వున్నాయి. ఎలక్షన్ల పేరుతో అబద్దాలు చెప్పం. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. రైతుబందు నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత 16వేలు ఇస్తాం. పెన్షన్లు కూడా పెంచుకుందాం, మహిళలకు 3 వేల రూపాయలు ఇస్తాం. విద్యాసంస్థలను కూడా పెంచుతాం. అద్భుతమైన అభివృద్ది జరిగింది. ఈ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించండి.

60 ఏండ్లు మోసం చేసిన కాంగ్రేస్ నయా మోసం, నయా అబద్దాలు చెప్తుతూ మళ్లీ ముందుకు వస్తుంది. ఇంత భారీఎత్తున తరలివచ్చిన ఈ సభ ద్వారా బిఆర్ఎస్ గెలువబోతుందని రుజువయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News