Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్KCR @ Sathupalli: అంబులెన్స్ కంటే ముందే వచ్చే వ్యక్తి సండ్ర: కేసీఆర్

KCR @ Sathupalli: అంబులెన్స్ కంటే ముందే వచ్చే వ్యక్తి సండ్ర: కేసీఆర్

ప్రజానాడి తెలిసిన నాయకుడు సండ్ర

సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్ని చూసి ప్రజల కొరకు ఏర్పాటు చేసిన టెంట్లు కూడా చాలలేదు అంటే ప్రజలు సండ్ర వెంకట వీరయ్య అని ఎంత అభిమానిస్తున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దళిత బందు గురించి మాట్లాడుతూ , దళిత బంధు ఎన్నికల కోసం తెచ్చింది కాదని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం, రాష్ట్రంలోనే మొదటిగా హుజూరాబాద్, ప్రతిపక్ష పార్టీ గెలిచిన మధిర నియోజకవర్గం చింతకాని మండలాల్లో వందకు వందశాతం దళిత బంధు అమలు చేయడం జరిగిందని. సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ఎన్నికల అయిన వెనువెంటనే సత్తుపల్లి వచ్చి దగ్గరుండి దళిత బంధు నూటికి నూరు శాతం అందిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

సీతారాం ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తి అయిందని , బిఆర్ఎస్ ప్రభుత్వం మరల అధికారంలో రాగానే ఒక సంవత్సరంలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు రెండు పంటలకు నీటిని సమృద్ధిగా అందిస్తానని, రైతుని రాజుగా నిలబెట్టడమే నా దేయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సండ్ర వెంకట వీరయ్యపై ప్రత్యేక ప్రశంసలు :-సీఎం కేసీఆర్

ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, తన నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అంబులెన్స్ కంటే ముందే వాలిపోయి వారి సమస్య తీర్చే వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య అని సీఎం కేసీఆర్ కొనియాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో 70 నుంచి 80 వేల మెజారిటీతో సండ్ర వెంకట వీరయ్య గెలిచి తీరుతాడని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ వాళ్లు సండ్ర వెంకట వీరయ్య పై ఏ అభ్యర్థిని నిలబెట్టాలోప్రతిపక్ష తెలియక అయోమయంలో పడ్డారని కెసిఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News