ఈనెల 18న ఖమ్మంలో BRS పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలోని పలు మండలాల ముఖ్య ప్రజా ప్రతినిధులు నాయకులతో సత్యవతి సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా నుండి లక్ష 20 వేల మందిని సభకి తరలించే విధంగా ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. టి.ఆర్.ఎస్ పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీగా మారిన తరవాత దేశానికి సందేశం ఇవ్వడానికి ఖమ్మంలో సీఎం కేసీఆర్ 5లక్షల మందితో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
Khammam: ఖమ్మంలో సీఎం సభను విజయవంతం చేయండి: సత్యవతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES