Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Korukonda Chander: ఆ ఐదుగురిపై వేటు తప్పదు

Korukonda Chander: ఆ ఐదుగురిపై వేటు తప్పదు

పార్టీకి నష్టం చేస్తున్న వారిపై వేటు

బిఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్న వారిపై వేటు తప్పదని రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చందర్ కు ఎమ్మెల్యే టికెట్ రాకుండా, ఈ ప్రాంతంలో బి ఆర్ ఎస్ పార్టీకి నష్టం కల్గించే విధంగా వ్యవహారిస్తున్న ఐదుగురు వ్యక్తులపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మార్కండేయ కాలనీలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చందర్ పాల్గొని మాట్లాడుతూ పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్న వారిపై వేటు తప్పదని వారి పేర్లను బహిర్గతం చేసారు.

- Advertisement -

ఇందులో పాలకుర్తి జడ్పీటిసి కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కోంకటి లక్ష్మీనారాయణ, పాతిపల్లి ఎల్లయ్య లక్ష్మి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తో పాటు మరొక వ్యక్తి బయ్యపు మనోహర్ రెడ్డి ఉన్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అభిషేక రావు, జడ్పీటిసి ఆముల నారాయణ, ఎంపిపిలు, కార్పొరేటర్లు, పార్టీ ఆయా ఏరియాలకు చెందిన ప్రధాన నాయకులు, పార్టీ క్రమశిక్షణ కమిటీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News