Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్KTR at rythu diksha: రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR at rythu diksha: రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్

సిరిసిల్ల రైతు దీక్షలో..

సిరిసిల్లలో రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ కామెంట్స్

- Advertisement -

ఎన్నికల ముందు రైతు బంధు కోసం మేము 7500 కోట్లు పెట్టినం… కానీ కాంగ్రెసోడు వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి రైతు బంధు బంద్ పెట్టిందని, తెలంగాణలో వ్యవసాయ సంక్షోభంలో ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత త్వరగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడుకోవాల్సి రావటం బాధాకరమని, కాంగ్రెస్ హామీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ఎర్రటి ఎండల్లోనూ కేసీఆర్ గారు రైతుల కోసం బయటకు వచ్చి నేనున్నా అని వారికి భరోసా ఇస్తున్నారన్నారు. కెేసీఆర్ బాటలో నడుస్తూ రైతుకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం రైతు దీక్ష కార్యక్రమం చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల కోడ్ తో రేవంత్ రెడ్డి పాలన అధికారం నా చేతిలో లేదు అంటున్నాడు. ఆయనకు ఉన్న అవగాహన అది అన్న కేటీఆర్, అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రైతు హామీలపైన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పాలని, 500 రూపాయల అదనపు బోనస్ ఇస్తారో, లేదో చెప్పండని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఎన్నికల కమిషన్ కి ఉత్తరం రాయాలన్నారు. 500 రూపాయల బోనస్ తో పాటు, రైతుల పంట నష్టానికి ఎకరానికి రూ. 25 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. మా పార్టీ తరఫున కూడా మద్దతు ఇస్తామన్నారు.

ఈసీ అందుకు ఒప్పుకోకుంటే వెంటనే ప్రతి రైతు అమ్మిన బియ్యం గింజను లెక్కలోకి తీసుకొని ఎలక్షన్లు ముగిసిన వెంటనే వారికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం చెల్లించాలని, రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు ఎన్నికల కమిషన్ సాకు చెబుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు వర్షాలు పడలేదని అబద్ధాలు చెబుతున్నారు. కానీ వాతావరణ శాఖ నివేదిక మాత్రం సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైందని తెలిపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంలో ఉన్న 300 పిల్లర్లలో రెండు, మూడు పిల్లర్లలో సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసమే లక్షల ఎకరాల పంట పొలాలను కాంగ్రెస్ ఎండబెట్టిందని, కేసీఆర్ ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ… పంటలు ఎండబెట్టి రైతుల పొట్ట కొడుతోందన్నారు. కొట్టుకుపోయిందన్న కాళేశ్వరంలో నంది పంపు హౌస్ ఎట్ల ప్రారంభమైంది…ఇప్పుడు నీళ్లను ఎట్ల పారిస్తున్నారు? డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి… ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని రైతుల తరఫున కొట్లాడకుండా ఆగుతామా? … వారికి అండగా నిలబడేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. రైతుల తరఫున మనం కొట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీ హామీలను పక్కనపెడుతుందన్నారు.

ఇప్పుడు కూడా కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఇచ్చిన అన్ని హామీలను ఎగకొడుతారని.. హామీలు అమలు చేయకున్నా ప్రజలు ఓటు వేశారని చెప్తారని, రేవంత్ రెడ్డి తన వంద రోజుల పాలనకు రెఫరెండం అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ హామీల ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటు వేయండన్న కేటీఆర్.. రైతుభరోసా, 4000 పెన్షన్, 2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్లు కాంగ్రెస్ ఓటు వెయ్యండి, రాని వాళ్లు మాకు ఓటు వేయండి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News