Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్KTR says 1000 crs scam: 1000 కోట్ల 'కొనుగోలుమాల్', నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR says 1000 crs scam: 1000 కోట్ల ‘కొనుగోలుమాల్’, నిప్పులు చెరిగిన కేటీఆర్

కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా

ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల కాంగ్రెస్ కుంభకోణంపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని, ఈ కుంభకోణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పటి దాకా ఒక్క మాట మాట్లాడలేదు… మేము లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని కేటీఆర్ మండిపడ్డారు. BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు.. గల్లిమే లూటో, ఢిల్లీలో భాటో అన్నదే కాంగ్రెస్ నీతి అన్న కేటీఆర్.. కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా అని ధ్వజమెత్తారు.

- Advertisement -

ధాన్యం సేకరణపైన దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యం పైన కన్ను వేసి ఈ స్కాంకి, అవినీతి చీకటి దందాకు తెరలేపారని, ఇప్పటికే రాష్ట్రంలో B టాక్స్, U టాక్స్, ఆర్ఆర్ టాక్స్ రాజ్యమేలుతుందని, ఇప్పుడు మీకు ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పని చేతనైత లేదు కానీ… తమ జేబులు నింపుకొని ప్రయత్నం చేస్తున్నారన, 35 లక్షల ధాన్యం నమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో పిలిచిన మొదటి స్కాం అన్నారు. 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పక్రియ రెండో కుంభకోణమని, మొత్తం వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగిందని ఆరోపించారు.

ధాన్యం అమ్మకం కోసం అవినీతి కుట్రకు తెర తీసిందని, జనవరి 25వ తేదీన కమిటీ వేసి, అదే రోజున కమిటీ ఏర్పాటు చేసి, ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసి, అదే రోజు టెండర్లను పిలిచిందన్నారు. హామీల అమలులో లేని ఈ జెడ్ స్పీడు అవినీతి సొమ్ము కోసం మాత్రం కాంగ్రెస్ పెద్దలు చూపించారని, ధాన్యంకు 2100 క్వింటాలు చొప్పున స్థానికంగా రైస్ మిల్లు కొంటాం అన్న ఇవ్వకుండా, అర్హత నిబంధనలో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెరలేపిందన్నారు. ఈ గ్లోబల్ టెండర్లను.. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయన్నారు.

ఈ సంస్థల్లో కేంద్రీయ బండాను మా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెడితే… ఆ సంస్థకు నిబంధనలో మినహాయింపు నుంచి బ్లాక్ లిస్టు కంపెనీని టెండర్లను పాల్గొనేలా చేసిందని, టెండర్ లో క్వింటాలుకు రూ.1885 నుంచి రూ.2007కు కోట్ చేసి.. దక్కించుకున్నాయన్నారు. 93 నుంచి 200 రూపాయల తక్కువకు గ్లోబల్ టెండర్లు పిలిచి కట్టబెట్టారని, కానీ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లకుండా ఈ నాలుగు సంస్థలు కేవలం ధాన్యం మాత్రమే సేకరించుకుని వెళ్లాలి కానీ… మిల్లర్లతో డబ్బులు తీసుకొని మనీ లాండరింగ్ పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ వరుసపెట్టి ఆరోపణలు చేసింది.

క్వింటాలుకు రూ.2230 తమకు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల రైస్ మిల్లర్లను.. ఈ కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని, ఇందుకు కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్న కారణాలని, సీఎం పేషీకి ఖర్చయిందట, ఢిల్లీ ఏఐసీసీ పెద్దలకు వాటాలు పంపించారట, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖజానా నింపారట, అందుకే క్వింటాలుకు కనీసం 150 రూపాయల వరకు అదనంగా కలిపి చెల్లించాలని రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారని కేటీఆర్ మీడియాకు వివరించారు. ఈ మేరకు అదనపుగా డబ్బులు ఇయ్యకుంటే సివిల్ సప్లై శాఖతోనే విజిలెన్స్ శాఖ కానీ దాడులు చేసి కేసులు పెట్టిస్తామని రైస్ మిల్లులను భయపెట్టిస్తున్నాయన్నారు. ధాన్యం బదులు నగదు కోసం పట్టుబడుతున్నాయని, 35 లక్షల మెట్రిక్ టన్నులకు కనీసం 200 చొప్పున అదనంగా వసులు చేసి 700 కోట్ల రూపాయలను మిల్లర్ల నుంచి వసూలు చేశాయన్నారు.

గత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థను ఈ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు, ఇందులో వందల కోట్ల రూపాయలు మీకు ముట్టిన విషయంలో కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టతను ఇవ్వాలన్నారు. మొత్తంగా ఈ రెండు స్కాంల రూపంలో మొత్తం 1100 కోట్ల రూపాయల స్కామ్ కి తెరలేపిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది… ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుమతి లేకుండా ఏమీ జరగదు అనే విషయం అందరికీ తెలుసన్నారు కేటీఆర్. ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దలు దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తంమవుతున్నాయన్నారు. ఈ మొత్తం స్కాంలో బిజెపి పాత్ర కూడా అనుమానాస్పదంగా, విచిత్రంగా ఉందని కూడా ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో కేంద్రం… ఎఫ్సీఐ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టము… న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. తప్పకుండా ఆధారాలతో సహా వీళ్ళందరిని కోర్టులతోపాటు ప్రజా కోర్టులోను ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News