Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Kurnool: ఒకే వేదికపై గుమ్మనూరు, కోట్ల ! రాజకీయం శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం

Kurnool: ఒకే వేదికపై గుమ్మనూరు, కోట్ల ! రాజకీయం శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం

ఒకే వేదికపై పరస్పర రాజకీయ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ కలిసి ఒకే వేదికను పంచుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అనంతరం కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ కోట్ల సుజాతమ్మ అక్కతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి కూర్చోవడం సంతోషంగా ఉందని, ఇదే గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం రాజకీయ కార్యక్రమంలో భాగంగా ఒకే వేదికపై ఉన్నామని ఇది రెండో సారి అని అన్నారు. రాజకీయం శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అంతా ఈశ్వర స్వామి మహిమే అని అన్నారు. హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో మాలాధార శివస్వాముల పూజా కార్యక్రమంలో భాగంగా ఆదిదేవుడు శ్రీఈశ్వరస్వామి దేవాలయంలో సామూహిక వివాహ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News