Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్బీసీ సబ్ ప్లాన్ తీసుకురావడానికి కృషి చేస్తా

బీసీ సబ్ ప్లాన్ తీసుకురావడానికి కృషి చేస్తా

జనాభాలో సగం ఉన్న బీసీలకు ఇంకా చాలా దక్కాలి

బీసీ సబ్ ప్లాన్ తీసుకురావడానికి కృషి చేస్తానని శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణంలోని వర్తక సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో 300 మంది లబ్ధిదారులకు డీసీ బందు బీసీ బందు స్కీం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక తోడ్పాటు చెక్కులను మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు రాష్ట్ర బడ్జెట్ లో సగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని, ఆర్థిక సహాయం పొందుతున్నవారు మంచి వ్యాపారాలు చేసి వృద్ధిలోకి రావాలని, ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి కూడా నిధులు ఇచ్చి యువత వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహించాలని లేఖ రాస్తానని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని జడ్పిటిసిలు ఎంపీపీలు సమన్వయ సమితి కన్వీనర్లు ఏఎంసీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రం రామారావులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News