Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Manchiryala: కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంటూ ఒకతాటిపైకి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

Manchiryala: కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంటూ ఒకతాటిపైకి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

మేమంతా కలిసే ఉన్నామంటున్న కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే సీట్లు గెలస్తామని గ్రూపు రాజకీయాలకు పోతే ఇతర పార్టీలు ఎమ్మెల్యే పదవులు కైవసం చేసుకునే అవకాశం ఉన్నందున మంచిర్యాలలోని ఎన్విఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారు మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆరెస్ రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేతున్నాయి, రానున్న స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సమక్షంలో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అన్నారు.

- Advertisement -

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు అంత కలిసే ఉన్నామని చెప్పడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం ఒక ఉదాహరణ అన్నారు. తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేకుండా పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హెచ్ఎంఎస్ కార్మిక రాష్ట్ర నాయకులు రియాజ్ అహ్మద్, కొక్కిరాల హరిప్రసాద్, కోవా సరస్వతి, సీనియర్ నాయకులు, న్యాయవాది కేవి ప్రతాప్, డాక్టర్ నిలకంటేశ్వర్, వోడ్నాల శ్రీనివాస్ తదితర ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News