Wednesday, September 4, 2024
Homeపాలిటిక్స్MLA Arther: ఎమ్మెల్యే ఆర్థర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం

MLA Arther: ఎమ్మెల్యే ఆర్థర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం

పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీకి ఎంపికైనసభ్యులకు ఘన సన్మానం

సీఎం జగనన్న నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాటసాని రామంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ సలహాలు సూచనలతో జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వైసీపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ వనజ పేర్కొన్నారు. నందికొట్కూరు స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు నుండి వైసీపీ జిల్లా విభాగంలో ఎంపికైన సభ్యులకు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో కార్యదర్శిగా డాక్టర్ వనజ, కార్యవర్గ సభ్యులుగా ఇనయాతుల్లా, పిరయ్య, తోగట ప్రసాద్ ఎంపికైన సందర్భంగా వారిని మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, కౌన్సిలర్స్ జాకీర్ హుస్సేన్, ఉండవల్లి ధర్మారెడ్డి, నాగటూరు ఉపసర్పంచ్ సగినేలా హుస్సేనయ్య,వైసీపీ నాయకులు పెరుమాళ్ళజాన్, తమ్మడపల్లె విక్టర్, దామగట్ల సర్పంచ్ భర్త రత్నం తదితరులు దుశ్యాలులతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైసిపి పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ వనజ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నవరత్న పథకాలతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న గొప్ప నాయకుడని ఆమె కొనియాడారు. జగనన్న ఆదేశాలను శిరసా వహిస్తూ వారి అడుగుల్లో అడుగై ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంచి మనసున్న నాయకుడు ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ అని ఆమె కొనియాడారు. సీఎం జగనన్న, ఎమ్మెల్యే ఆర్థర్ మాపై ఉంచిన నమ్మకాన్ని ఇచ్చిన బాధ్యతలతో జిల్లాలోనే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్యాల శంకర్, శాతన కోట వెంకటేష్, వెంకటేశ్వర్ రెడ్డి, భూషి గౌడ్, కార్పెంటర్ మహబూబ్ బాషా వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News