Friday, September 20, 2024
Homeపాలిటిక్స్MLA Satish: గులాబీమయమైన జగన్నాధపూర్

MLA Satish: గులాబీమయమైన జగన్నాధపూర్

కదిలిన గులాబీ దండు

మరొకసారి అవకాశం ఇవ్వండి ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగుతుందంటూ.. జగన్నాధపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. జగన్నాధపురం నుండి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించగా అట్టహాసంగా పలు కార్యక్రమాలు పెద్దఎత్తున సాగాయి.

- Advertisement -

ఎల్కతుర్తి మండలం జిలుగులలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, మైనార్టీ భవనం కోసం శంకుస్థాపన చేసి బిఆర్ఎస్ జెండా ఆవిష్కరించి యువకుల బైక్ ర్యాలీతో జగన్నాధపురం గ్రామానికి వెళ్లారు సతీష్. మంగళ హారతులు, డప్పు చప్పుళ్ళు, యువకుల కేరింతలు హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా కదిలి వచ్చిన గులాబీ శ్రేణులతో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ వెంట రాగా ఎల్కతుర్తి మండలం జగన్నాధ పూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ దంపతులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

జగన్నాధపూర్, జిలుగుల గ్రామాలు గులాబీమయమై ఎక్కడ చూసినా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోలాహలంగా డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, మహిళల మంగళ హారతులతో ప్రచారాన్ని ఉర్రూతలూగించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని జగన్నాధపూర్ శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రారంభించడం ఆనవాయితీ దాన్ని కొనసాగిస్తూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ దంపతులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News