Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Patancheru: హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్

Patancheru: హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్

మెడపై కత్తిపెట్టి బెదిరింపులా?

అక్రమ కేసులు పెట్టి మా ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశానికి హాజరైన హరీశ్ రావు, హరీష్ ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే కాంగ్రెస్ పని అయిపోయింది, పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసిందని భగ్గుమన్నారు.

- Advertisement -

వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ నిప్పులు చెరిగిన హరీష్.. ఆయన ఏమైనా బందిపోటా, FIR కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేసారని నిలదీశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని, బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్నా ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారని, ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు, మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా RDO చెప్పారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయని, వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయి BRS నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారని హరీష్ అన్నారు. ఇప్పటికి మూడు కేసులు పెట్టారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని, గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు…పంటలు ఎండిపోతున్నా ఇవేవీ పట్టించుకోరన్నారు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తోందని, ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తామని హెచ్చరించారు. మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారని, పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని హరీష్ రావు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News