Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Revant Reddy @ Kosgi rally: కోస్గి ర్యాలీలో కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరిగిన...

Revant Reddy @ Kosgi rally: కోస్గి ర్యాలీలో కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

వంశీని ఎంపీగా గెలిపించండి

కోస్గి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజక వర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా, ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ను అడుగుతున్నా.. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు పాలమూరుకు చేసిందేంటి? పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని నీకు ఓట్లు అడిగే అర్హత లేదు. ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు, అయ్యా కొడుకులు ఏం మొహం పెట్టుకుని పాలమూరు జిల్లాకు వస్తారు?

- Advertisement -

పాలమూరును ఎండబెట్టి.. కొడంగల్ ను పడావు పెట్టి ఎడారి చేశారు. 70 ఏండ్ల మన గోస తీరుస్తానని మొన్నటి ఎన్నికల్లో మాట ఇచ్చా… ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నా. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2014లో నేను మంజూరు చేయించుకొచ్చా. కానీ కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేట్-కొడంగల్ పథకాన్ని పదేండ్లు పడావు పెట్టింది. కొమ్మోడి వెంబడి సన్నాయివాడు పడినట్లు బీజేపీ వైఖరి ఉంది. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డిలను అడుగుతున్నా..పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014లో మోడీ ఇచ్చారు. పదేండ్లుగా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో డీకే అరుణ, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి, కృష్ణా రైల్వే లైన్ ఎందుకు ముందుకు సాగలేదని నేను అడుగుతున్నా.

కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా… నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి నాలుగు రూపాయలైన తెచ్చారా? మరి పాలమూరు జిల్లాలో ప్రజలను ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు? కృష్ణా జలాలు కొడంగల్ రైతులకు అందేంచే పని మా ప్రభుత్వం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ ఇవ్వండి..మళ్లీ 5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం.. కాంగ్రెస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా.. ఇదివిరామం మాత్రమే.. ఇంకా యుద్ధం ముగిసిపోలేదు.. 17లో 14 పార్లమెంటు స్థానాలు గెలిచినపుడే.. పార్లమెంట్ లో మనం పట్టు సాధించినపుడే యుద్ధం గెలిచినట్టు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న బీఆరెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి.

వచ్చే వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం..200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తాం..వచ్చే నెల 16లోగా అందరికీ రైతు భరోసా అందిస్తాం.. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం..వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించండి అంటూ రేవంత్ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News