Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Revanth Reddy in TPCC: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో 3 తీర్మానాలు

Revanth Reddy in TPCC: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో 3 తీర్మానాలు

కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం, ఇందిరా భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానం కాగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని, వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాదంటూ రేవంత్ అన్నారు.

- Advertisement -

బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆరెస్ కు బుద్ది రాలేదని, నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుందని ఆయన ఆరోపించారు. బీఆరెస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని, రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలన్నారు ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తానన్నారు.

ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని, 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానన్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందన్న రేవంత్.. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారన్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారని సీఎం నిలదీశారు, దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారని, కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలన్న సీఎం, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు… పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News