Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Singireddy Niranjan Reddy: తెచ్చుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుంటున్నాం

Singireddy Niranjan Reddy: తెచ్చుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుంటున్నాం

భావితరాల భవిష్యత్ కోసమే పునర్నిర్మాణం

తెచ్చుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుంటున్నమనీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. భావితరాల భవిష్యత్ కోసమే పునర్నిర్మాణం, అసాధ్యమన్న తెలంగాణను సుసాధ్యం చేశామన్నారు. రైతుబంధు, ఉచితంగా 24 గంటల ఇవ్వడం సాధ్యం కాదని జానారెడ్డి అన్నారనీ, ఆచరణలో దాన్ని సాధ్యం చేసి చూపించమని అన్నారు. సంక్షేమ పథకాలతో బలహీనవర్గాలకు అండ, అభివృద్ది పథకాలతో ఉపాధి, సగటు సామాన్య జీవులు విద్య, వైద్యం మీద అధిక ఖర్చు చేస్తున్నారనీ, అటువంటి రంగాలను అభివృద్ది చేసి పేదలపై ఆర్థిక భారం పడకుండా చేస్తున్నమనీ, రూ.3.15 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తెలంగాణ కన్నా వెనకబడి ఉన్నాయనీ,ప్రణాళికాబద్దంగా చేపట్టిన చర్యల మూలంగానే ఈ అభివృద్ది సాధ్యం అయిందన్నారు.ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి రాకతో పల్లెలు కళకళలాడుతున్నాయనీ గత పాలకులు మూడు, నాలుగు దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణాలను సాగదీశారనీ, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం మూలంగా ఫలితాలు రాకపోగా వ్యయం పెరుగుతుంది .. దీనికి ఉదాహరణ జూరాల ప్రాజెక్టు అని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రెండు తరాలు నష్టపోయింది .. అందుకే శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. మూడేన్నరేళ్లలో కాళేశ్వరం పూర్తి చేశామని, 200 ఫించను రూ.2016కు పెంచామని,ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీలు పట్టించుకోరు .. తమ బతుకులకు ఎవరు గ్యారంటీ అన్నదే గమనిస్తారనీ అన్నారు.జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్రానికో వేషం వేస్తున్నదనీ,కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి సహకారంతో పూర్తి చేశామన్నారు.భవిష్యత్ లో ఏమి అవసరమో ఆలోచించి రేపు ముఖ్యమంత్రి సభలో హామీ తీసుకుంటామని, సీఎం సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..విద్యుత్ వాడకం పెరగడమే అభివృద్దికి సంకేతం అని, 2014 లో తెలంగాణ పునర్విభజనపై అనేక అంశాలు సూచించడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వంలో అవి సాకారమయ్యాయనీ, తెలంగాణలో జరిగిన అభివృద్దిపై ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నదనీ అన్నారు. వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని, అందరం కలిసి ఎన్నికల్లో సమిష్టిగా పని చేద్దామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని, వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్దిని చూసి పట్టంకడతారనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి ,
జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ , వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ , శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి , పట్టణ ఎన్నికల ఇంచార్జ్ అరుణ్ ప్రకాష్ , మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ , జిల్లా గొర్రెల కాపరుల జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్లు పుట్టపాకుల మహేష్ , పాకనాటి కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News