Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Minister Singireddy Wife: పల్లెనిద్రలో పాల్గొన్న మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి

Minister Singireddy Wife: పల్లెనిద్రలో పాల్గొన్న మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి

వందకు పైగా గ్రామాల్లో పల్లెనిద్ర చేసిన ఏకైక నాయకుడు నిరంజన్ రెడ్డి

వనపర్తి నియోజకవర్గంలో గడిచిన 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదరించాలని సింగిరెడ్డి వాసంతి అన్నారు. మండలంలోని జానంపేట గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పలు వీధిలో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 సంవత్సరాలలో చేసి చూపించిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో వనపర్తిని అభివృద్ధి విషయంలో అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పనితీరుతో జిల్లాకు నూతన మెడికల్, ఇంజనీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలలు వచ్చాయని , పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తో వ్యవసాయానికి సాగునీటి విషయంలో మరింత తోడ్పాటు అవుతుందని ఆమె వివరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కృషి వల్ల 60 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా గ్రామీణ ప్రాంత రోడ్లు పట్టణ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందాయని అందుకు నిదర్శనం ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి నిరంతర శ్రమజీవిని ఆమె అన్నారు. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో మంత్రి నిరంజన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె కోరారు. అంతకుముందు గ్రామంలో గల ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News