Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Suspension: జూపల్లి , పొంగులేటిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్

Suspension: జూపల్లి , పొంగులేటిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్

జూపల్లి , పొంగులేటి  పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ఎంపీ పి. రాములు, ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్ రెడ్డి  ఆరోపించారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, సందర్భం లేకున్నా సంధర్భం సృష్టించుకొని ప్రవర్తించారని వారు ఆరోపించారు. తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారని, వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఓకరిద్దరి కోసం పార్టీ ని ఫణంగా పెట్టమని, పార్టీ అధినేత నే విమర్శించే స్థాయి కి చేరుకోవడం పరాకాష్ట అన్నారు. ఎవరినైనా పార్టీ వీడకుండా ఉండాలనే పార్టీ చూస్తుందని, కేసీఆర్ ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్బాలు ఉన్నాయన్నారు.

- Advertisement -

టిఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీ లో చేరారని, జూపల్లి కి పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రి గా అవకాశం ఇచ్చారని, ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది.. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడినా, జూపల్లికి సొంత ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం లేదన్నారు.

ప్రతిపక్షాలు మాట్లాడే అంశాలే జూపల్లి, పొంగులేటి మాట్లాడుతున్నారని, అభివృద్ధి జరగకుంటే ఇన్ని రోజులు పార్టీలో ఎందుకు ఉన్నారని నిలదీశారు నిరంజన్ రెడ్డి. వారిద్దరూ పార్టీని బలహీన పరచాలని చూస్తున్నారని, పునరాలోచన చేసుకుంటారని ఇన్ని రోజులు వేచి చూసినట్టు తెలిపారు.  కేసీఆర్ ను విమర్శించి బయటకు వెళ్లి విజయం సాధించిన వారు ఇప్పటివరకు ఎవరూ లేరని వారు హెచ్చరించారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత పొంగులేటి టిఆర్ఎస్ లో చేరారని, తెలంగాణ ఉధ్యమంలో పొంగులేటి పాత్ర లేదన్నారు.  పొంగులేటి పార్టీలో ఏం చేశారో, ఎందుకు అవకాశం రాలేదో ఖమ్మం ప్రజలకు తెలుసన్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బీఆర్ఎస్ లో చేరినప్పుడే జూపల్లి రాజీనామా చేయాల్సిందని, పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వారు ప్రశ్నించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్ ను పోటీ పెట్టాడని, గత తొమ్మిది ఏళ్ళుగా ఆత్మాభిమానం ఎటుపోయిందన్న వారు, జూపల్లి జగన్ కోసం రాజీనామా చేశాడని తెలంగాణ కోసం చేయలేదన్నారు.  జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో ఉంటుంది.. కేసీఆర్ ఫోటో ఎందుకు లేదని నేను అడిగా..తెలంగాణ వ్యతిరేకి అయిన వైఎస్సార్ ఫోటో ఎందుకు జూపల్లి పెట్టుకున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు.  మంత్రిగా తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా వైఎస్సార్ విగ్రహం పెట్టారని, నిన్న మొన్న ఆంధ్ర నుంచి వచ్చి పార్టీ పెట్టిన వాళ్ళు విమర్శించినట్లే ..పొంగులేటి, జూపల్లి విమర్శిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News