Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Pilot: తాండూర్ లో గెలిచేది నేనే, నిలిచేది నేనే

Pilot: తాండూర్ లో గెలిచేది నేనే, నిలిచేది నేనే

ఇంట్లోనికి బయటోనికి మధ్య ఎన్నికలు

తాండూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో భారీ ర్యాలీతో తన నివాసం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు గులాబీ శ్రేణుల మధ్య భారీ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ దఫా నామినేషన్ దాఖలు చేశారు. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ లోని గెలుపుకు తిరుగులేదు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాండూర్ లో పైలట్ రోహిత్ రెడ్డి గెలుస్తాడని అన్నారు. తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇంటోనికి బైటోనికి మధ్య ఎన్నికలు సాగుతున్నాయన్నారు.

- Advertisement -

తాండూర్ బిడ్డకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారు కానీ తాండూర్ లో దొంగలంతా ఏకమై తాండూరుపై కుట్ర చేస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసమే వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూర్ లో స్థానం లేదన్నారు. డబ్బు సంచులతో తాండూర్ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని కొనలేరు, తాండూర్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి గడపకు వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారని, తాండూర్ భవిష్యత్తు కొరకు ఈరోజు నామినేషన్ ర్యాలీలా కనిపించడం లేదు విజయోత్సవ ర్యాలీగా కనబడుతుందన్నారు. తాండూర్ లో గెలిచేది నేనే నిలిచేది నేనే అని తొడగొట్టి, తన అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపారు పైలట్.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ సంఘాల అధ్యక్షులు యువ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News