Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Pravin Kumar: సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

Pravin Kumar: సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

యువత భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. కమలాపూర్ మండలం మదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి తోపాటు మండలంలోని మడిపల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాలలో ప్రణవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామని అన్నారు.

- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. హుజురాబాద్ లో వ్యాపారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. వ్యాపారులెవరు అధైర్య పడవద్దని హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News