Friday, February 21, 2025
Homeపాలిటిక్స్Vallabhaneni vamsi: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌

Vallabhaneni vamsi: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌

గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni vamsi)ని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. అనంతరం వంశీకి 14 రోజుల చొప్పున రిమాండ్‌ విధించింది విజయవాడ కోర్టు.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే.
తెదేపా కార్యాలయంలో పని చేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం ఉదయం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేయగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్‌, నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు.

సత్యవర్దన్‌ వాగ్మూలం నమోదు
మరోవైపు విజయవాడ పడమట పోలీస్‌ స్టేషన్‌లో సత్యవర్దన్‌ వాగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణ లంక పోలీస్‌ ష్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వంశీతోపాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు
ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. అనంతరం వంశీతో పాటు అతని అనుచరులు లక్ష్మిపతి, శివరామకృష్ణ ప్రసాద్ లకు రిమాండ్ విధించారు పోలీసులు వారిని విజయవాడ పోలీసు స్టేషనుకి తరలించారు.


రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
వంశీ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్‌ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉందని అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు.


4 ప్రత్యేక బృందాలు
ఎన్టీఆర్‌ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చాం. ఈ కేసులో ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారు. సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News