BCCI Awards ACA: బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఐసీసీ ఛైర్మన్ జైషా, ఏసీఏ కార్యదర్శి సనా సతీష్ బాబు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సందర్భాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆంధ్రా క్రికెటర్లకు అవార్డులందజేశారు. వారి అసాధారణ ప్రతిభ, అంకితభావాన్ని తెలియజేసేలా గొప్ప అవార్డులు సాధించారని వక్తలు కొనియాడారు.
మిథాలీ రాజ్కు లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు, శ్రీచరణికి ఇంటర్నేషనల్ డెబ్యూ క్రికెటర్ అవార్డు, ఎండీ షబ్నమ్కు అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీం అవార్డును ప్రకటించారు. మిథాలీ రాజ్కు జైషా చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఈ విషయం ఏసీఏకే గర్వకారణమని అతిథులు పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/business/gold-rates-march-16-2026-hyderabad-chennai-bangalore-160480/
అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు కేశినేని శివనాథ్ (చిన్ని), సానా సతీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రా క్రికెటర్లు ఈ గొప్ప అవార్డులతో సత్కరించడం తమకు అపార గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్లోనూ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాక్షించారు.

