Friday, September 20, 2024
HomeఆటAllagadda: ఎద్దుల పందాల పోటీలను ప్రారంభించిన గంగుల

Allagadda: ఎద్దుల పందాల పోటీలను ప్రారంభించిన గంగుల

అహోబిలం నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని అహోబిలంలో ఎద్దుల పందాల పోటీలను ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల నాని గంగుల సుదర్శన్ రెడ్డి గంగుల భరత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుండి మాజీ ఎమ్మెల్యే తమ తండ్రి స్వర్గీయ గంగుల తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం వృషభ రాజ పోటీలను ప్రతి సంవత్సరం అహోబిలం బ్రహ్మోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి వృషభలు పాల్గొన్నారు తెలిపారు.

- Advertisement -

మూడు రోజులు వృషభ రాజుల పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ పోటీలు సాంప్రదాయాలకు నిదర్శనం అన్నారు. పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News