Saturday, November 15, 2025
HomeఆటDelhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌

మరో వారం రోజుల్లో ఐపీఎల్‌ 2025(IPL 2025) ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. మరోవైపు అన్ని ఫ్రాంఛైజీలు తమ కెప్టెన్లను కూడా ప్రకటించాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్Delhi Capitals)తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సారథిగా నియమించినట్లు తెలిపింది. కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నప్పటికీ కెప్టెన్సీ వైపు మొగ్గుచూపలేదు. దీంతో అక్షర్ పటేల్‌ వైపు యాజమాన్యం మొగ్గుచూపింది. గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో రాహుల్‌ను రూ. 14 కోట్ల‌కు డీసీ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

కాగా గ‌త కొన్నేళ్లుగా ఢిల్లీ జ‌ట్టులో అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క ప్లేయ‌ర్‌గా ఉన్నారు. అంత‌కుముందు ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్‌గా రిష‌భ్ పంత్ కొన‌సాగాడు. అయితే అతడు వేలానికి మొగ్గుచూపడంతో లక్నో సూపర్ జెయింట్స్ రూ.27కోట్లుకు కొనుగోలు చేసింది. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ త‌మ తొలి మ్యాచ్‌ను ఈనె 24న ఆడ‌నుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ల‌క్నో సూపర్ జెయింట్స్‌తో డీసీ త‌ల‌డ‌నుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad