Sunday, October 6, 2024
HomeఆటBalanagireddy: యువత క్రీడల్లో రాణించాలి

Balanagireddy: యువత క్రీడల్లో రాణించాలి

ప్రోత్సాహక బహుమతి అందజేత

నేటి ఆధునిక ప్రపంచంలో యువత అన్ని రంగాల్లో రాణించడంతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, పుట్టిన గడ్డకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి అన్నారు. కోసిగి మండల పరిధిలోని కందుకూరు డీలర్ రమేష్, హనుమంతి దంపతుల కుమారుడు కోసిగి మల్లికార్జున కడప జిల్లా వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్నాడు. మల్లికార్జున ఈనెల 14,15,16వ తేదీన వరంగల్ నందు జరిగిన సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్లో 5కిలోమీటర్ల పరుగుపందెంను కేవలం 25.43 నిమిషాల్లో సాధించి, ప్రథమ స్థానంలో నిలిచాడు. అందులో భాగంగా స్థానిక నాయకులు/వైకాపా మండల అధ్యక్షులు బెట్టనగౌడ్ తో కలిసి ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి, మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా రాంపురంలో కలిశారు. ఈసందర్బంగా మల్లికార్జునను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మురళీ రెడ్డి అభినందనలు తెలిపిన అనంతరం 5వేల రూపాయలు ప్రోత్సహక బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో యంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజు, కోసిగయ్య, కామనదొడ్డి నరసింహులు గౌడ్, కాంట్రాక్టు నాగరాజు, నాగిరెడ్డి, నారాయణ, బీమారెడ్డి, దేవేంద్ర, హానుమంతు, బుడ్డయ్య, శివరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News