Saturday, November 15, 2025
HomeఆటBCCI: డ్రీమ్ 11తో బీసీసీఐ కటీఫ్.. రూ. 358 కోట్ల ఒప్పందం రద్దు

BCCI: డ్రీమ్ 11తో బీసీసీఐ కటీఫ్.. రూ. 358 కోట్ల ఒప్పందం రద్దు

BCCI sponsorship deal termination: దేశంలో కొత్తగా ఆన్ లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఇలాంటి సమయంలో భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11, టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. రూ. 358 కోట్ల భారీ ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంది. అయినప్పటికీ, బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై డ్రీమ్ 11 ప్రతినిధులు నేరుగా బీసీసీఐ కార్యాలయానికి వెళ్లి, తమ నిర్ణయాన్ని సీఈఓ హేమాంగ్ అమిన్‌కు తెలియజేశారు. “కొత్త చట్టం కారణంగా తాము స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులు మాకు స్పష్టం చేశారు. దీంతో రాబోయే ఆసియా కప్‌కు వారు స్పాన్సర్‌గా ఉండరు. త్వరలోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలుస్తాం” అని బీసీసీఐ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

Read Also: BYD Atto 2: భారత్ లో లాంఛ్ కు సిద్ధంగా బీవైడీ అట్టో 2..!

ఒప్పందం ప్రకారం, ఒకవేళ ఏదైనా కొత్త చట్టం వల్ల కంపెనీ ప్రధాన వ్యాపారానికి ఆటంకం కలిగితే, ఎలాంటి జరిమానా లేకుండా స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగేందుకు డ్రీమ్ 11కు వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు కారణంగానే, ఒప్పందాన్ని ముందుగా రద్దు చేసినందుకు బీసీసీఐకి వారు ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. 2023లో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ పరిణామం వల్ల కేవలం బీసీసీఐపైనే కాకుండా, క్రికెట్ ప్రపంచంపై కూడా ప్రభావం చూపనుంది. డ్రీమ్ 11 ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలతో పాటు, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి అనేక మంది స్టార్ క్రికెటర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

గతంలోనూ..

గల్వాన్ ఘర్షన తర్వాత భారత్ -చైనా ఉద్రిక్తతల మధ్య వివో స్పాన్సర్ గా తప్పుకుంది. వివో తప్పుకున్నప్పుడు, 2020లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కూడా డ్రీమ్ 11 వ్యవహరించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్, న్యూజిలాండ్ డొమెస్టిక్ టీ20 టోర్నీ ‘సూపర్ స్మాష్’ వంటి లీగ్‌లకు కూడా డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఉంది. ఐపీఎల్ స్థాయిలో ఆర్థిక బలం లేని ఈ లీగ్‌లు రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవల అనియంత్రిత విస్తరణ వల్ల ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని కేంద్రం భావించింది. ఇవి దేశ భద్రతకు ముప్పుగా మారాయని కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తెచ్చింది.

Read Also: Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏంచేయాలి..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad