Monday, June 9, 2025
HomeఆటBCCI: భారత్ ఆడబోయే టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు

BCCI: భారత్ ఆడబోయే టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు

స్వదేశంలో టీమిండియా ఆడబోయే టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్లో బీసీసీఐ(BCCI) మార్పులు చేసింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లతో జరగబోయే టెస్ట్ మ్యాచ్‌ల వేదికలను మార్చింది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడమే లక్ష్యంగా కొన్ని మ్యాచ్‌ల వేదికల్లో మార్పులు చేసినట్లు తెలిపింది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ ఈ ఏడాది నవంబర్ 14న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే తాజాగా ఈ మ్యాచ్ వేదికను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు. అలాగే అక్టోబర్ 10న వెస్టిండీస్‌తో జరగాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చారు.

పురుషుల మ్యాచ్‌లతో పాటు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ వేదికల్లో కూడా మార్పులు చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా తొలి రెండు వన్డేలు న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చింది.

తాజా షెడ్యూల్ ఇదే..

భారత్- వెస్టిండీస్ టెస్ట్ సిరీస్..

తొలి టెస్ట్ – అక్టోబర్ 2 – అక్టోబర్ 6 వరకు (అహ్మదాబాద్‌)
రెండో టెస్ట్ – అక్టోబర్ 10- అక్టోబర్ 14 వరకు (న్యూఢిల్లీ)

భారత్- దక్షిణాఫ్రికా సిరీస్..

తొలి టెస్ట్- నవంబర్ 14- నవంబర్ 18 వరకు (కోల్‌కతా)
రెండో టెస్ట్- నవంబర్ 22 – నవంబర్ 26 వరకు (గౌహతి)

మొదటి వన్డే – నవంబర్ 30 – రాంచీ
రెండో వన్డే – డిసెంబర్ 3- రాయ్‌పూర్‌
మూడో వన్డే – డిసెంబర్ 6 – వైజాగ్

తొలి టీ20- డిసెంబర్ 9 – కటక్‌
రెండో టీ20- డిసెంబర్ 11 – ముల్లన్పూర్
మూడు టీ20- డిసెంబర్ 14 – ధర్మశాల
నాలుగో టీ20- డిసెంబర్ 17 – లక్నో
ఐదో టీ20- డిసెంబర్ 19 – అహ్మదాబాద్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News