Saturday, November 15, 2025
HomeఆటBCCI: టీం ఇండియా కొత్త లోగో

BCCI: టీం ఇండియా కొత్త లోగో

టీం ఇండియా కిట్ మారింది. కిట్ స్పాన్సరర్ గా MPL కాకుండా కిల్లర్ వచ్చి చేరింది. శ్రీలంకతో జరుగనున్న T20I సిరీస్ లో ఎంపీఎల్ కాకుండా కిల్లర్ లోగోతో ఉన్న జెర్సీలను ధరించి మనవాళ్లు మైదానంలో కనిపించనున్నారు. మొబైల్ ప్రీమియర్ లీగ్ ( MPL) ఇప్పటివరకు మెన్ ఇన్ బ్లూకు కిట్ స్పాన్సరర్ గా ఉండగా ఇప్పుడు క్లోతింగ్ బ్రాండ్ కిల్లర్ ఆ స్థానంలో వచ్చింది. నిజానికి ఎంపీఎల్ బ్రాండ్ 2023 డిసెంబర్ 31 వరకు లోగో స్పాన్సరర్ గా ఉంది కానీ ముందే వైదొలగడంతో బీసీసీఐ కిల్లర్ ను కిట్ స్పాన్సరర్ గా ఉంచింది. పేటీఎం, బైజు కాంట్రాక్టులు కూడా ముగుస్తున్నాయి. బైజూ కూడా కాంట్రాక్ట్ కంటే ముందే వైదొలగేందుకు రెడీ అయింది. కానీ పేటీఎం ప్లేసులో మాస్టర్ కార్డ్ వచ్చి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad