ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఈ రెండు జట్లలో ఈరోజు గెలిచే జట్టు సెమీస్కు దూసుకెళ్లనుంది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు దుమ్మురేపిన సంగతి తెలిసిందే. 320 పరుగులకు స్కోర్ను ఛేదించి ఔరా అనిపించింది. దీంతో ఈ మ్యాచ్లో కూడా అదరగొట్టాలని చూస్తోంది. ఇంగ్లిస్, మ్యాక్స్వెల్, షార్ట్, లబుషేన్, క్యారీ, కెప్టెన్ స్మిత్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
ఇక సౌతాఫ్రికా కూడా మంచి ఊపు మీద ఉంది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్పై అద్భుతమైన విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో సమతూకంగా ఉంది. ముఖ్యంగా ఆసీస్ బౌలింగ్ కంటే సౌతాఫ్రికా బౌలింగ్ బలంగా ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం విధితమే.