Sunday, July 7, 2024
HomeఆటChevella: జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

Chevella: జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

క్రీడాకారుడు బోడ అనిల్ కుమార్ స్మారకార్ధం

చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో సీనియర్ నేషనల్ క్రీడాకారుడు బోడ అనిల్ కుమార్ స్మారకార్ధం 5వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి చేవెళ్ల సిఐ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ… యువతకు క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దరుద్యానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడలు యువతలో ఉన్న సృజనత్మాకతను వెలికితీసేందుకు ఉపయోగపడుతాయన్నారు. క్రీడలు ఆడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తోందన్నారు. క్రీడాకారులు క్రీడల్లోనే కాదు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగి రెడ్డి, చేవేళ్ల పీ ఏ సీ ఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి,చేవేళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగా రెడ్డి, మాజీ సర్పంచ్ లు రెడ్డి శెట్టి మధు సూదన్ గుప్తా, మల్లి పెద్ధి వెంకటేశం గుప్తా, ముడిమ్యాల పిఎసిఎస్ చైర్మన్ గొనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జుక్కన్న గారి శ్రీకాంత్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీలం ప్రతాప్ రెడ్డి, సమతా సైనిక్ దళ్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు మాచన్ పల్లి రామస్వామి, మాజీ వార్డు సభ్యులు బేగరి అనిల్, దొడ్డి అంజయ్య, కుర్మ సంఘం అధ్యక్షులు దొడ్డి రాము, ఆర్గనైజర్స్ డప్పు రాజు, బోడ సామెల్, బోడ వెంకటేష్, బోడ సీమోన్, బోడ రవి, డప్పు మహేందర్, బోడ శ్రీహరి, కానపురం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News