De Villiers: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐపీఎల్ కు తిరిగి వచ్చే అవకాశంపై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అయితే, ఈసారి ప్లేయర్ గా కాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కోచ్ లేదా మెంటార్ వంటి కొత్త పాత్రలో కనిపించవచ్చని సంకేతాలిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. డివిలియర్స్ తన ఫ్యూచర్ ప్లానింగ్ పై పలు విషయాలను పంచుకున్నాడు. “భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్తో అనుబంధం ఏర్పరచుకోవచ్చు. కానీ పూర్తి సీజన్ పాటు ప్రొఫెషనల్గా కట్టుబడి ఉండటం చాలా కష్టం. అలాంటి రోజులు ముగిశాయని నేను భావిస్తున్నాను. అయినా, ఎప్పుడూ ఏదీ జరగదని చెప్పలేం. నా మనసంతా ఎప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు లేదా నా ఫ్రాంచైజీకి అవసరం ఉందనిపిస్తే, కోచ్ లేదా మెంటార్ పాత్రలో తిరిగి రావడం కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశాడు.
Read Also: Delhi Metro: ఢిల్లీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. మెట్రో ఛార్జీల పెరుగుదల
ఐపీఎల్ లో సుదీర్ఘ కాలం..
2021లో అన్ని రకాల క్రికెట్కు ఏబీ డివిలియర్స్ వీడ్కోలు పలికారు. ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరఫున 157 మ్యాచ్లు ఆడి 41.10 సగటు, 158.33 స్ట్రైక్ రేట్తో 4,522 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016 సీజన్లో విరాట్ కోహ్లీతో కలిసి గుజరాత్ లయన్స్పై రెండో వికెట్కు 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. తన ఐపీఎల్ కెరీర్ను 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్తో ప్రారంభించిన డివిలియర్స్, మూడు సీజన్ల తర్వాత 2011లో ఆర్సీబీలో చేరాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఆ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2022లో క్రిస్ గేల్తో పాటు డివిలియర్స్ను ఆర్సీబీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చి గౌరవించింది. అయితే, ఇప్పుడు తిరిగి ఆర్సీబీ చెంతకు డివిలియర్స్ చేరతారనే ఉహాగానాలపై అభిమానులు ఖుషీగా ఉన్నారు.
Read Also: BCCI: డ్రీమ్ 11తో బీసీసీఐ కటీఫ్.. రూ. 358 కోట్ల ఒప్పందం రద్దు


