Saturday, June 7, 2025
HomeఆటENG vs IND: ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు

ENG vs IND: ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు

గత రెండున్నర నెలలుగా ఐపీఎల్ టోర్నీతో బిజీగా గడిపిన టీమిండియా(Team India) ఆటగాళ్లు సుదీర్ఘ టెస్టు క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యారు. ఇంగ్లాండ్‌తో(ENG vs IND) ఐదు మ్యాచ్‍ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో అడుగుపెట్టారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తరువాత భారత్ జట్టు ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. దీంతో ఈ టెస్టు సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్లు లండన్‌లో అడుగుపెట్టారు. ఆటగాళ్లు లండన్‌లో ల్యాండ్ అయిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. వీరికి ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది.

తొలి టెస్టు ఈనెల 20 నుంచి 24 వరకు- హెడ్డింగ్లీ, లీడ్స్

రెండో టెస్టు జులై 2 నుంచి 6 వరకు- ఎడ్జ్ బస్టన్, బర్మింగ్ హామ్

మూడో టెస్టు జులై 10 నుంచి 14 వరకు- లార్డ్స్, లండన్

నాల్గో టెస్టు జులై 23 నుంచి 27 వరకు- ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫొర్డ్, మాంచెస్టర్

ఐదో టెస్టు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు- కెన్నింగ్టన్ ఓవల్, లండన్

భారత జట్టు: అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News