ఇంగ్లండ్(England)- వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే, టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్టేలను ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు గెలుచుకుని సిరీస్ను కైవసం చేసుకుంది. ఇవాళ నామమాత్రమైన మూడో వన్డే లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్కు సైకిళ్ల మీద ఇంగ్లీష్ ఆటగాళ్లు చేరుకోవడం గమనార్హం.
- Advertisement -
క్రికెట్ స్టేడియాలకు క్రికెటర్లు ప్రత్యేక భద్రత మధ్య బస్సుల్లో చేరుకుంటారు. కానీ ఇంగ్లండ్ ఆటగాళ్లు మాత్రం సైకిళ్ల మీద చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్లో రోడ్లు మూసివేయడంతో ఇలా సైకిళ్ల మీద చేరుకున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.