Monday, June 2, 2025
Homeఆటపాండ్యా-గిల్ మధ్య గొడవ జరిగిందా.. సోషల్ మీడియాలో జోరుగా రూమర్స్..!

పాండ్యా-గిల్ మధ్య గొడవ జరిగిందా.. సోషల్ మీడియాలో జోరుగా రూమర్స్..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై-పంజాబ్ మ్యాచ్ తర్వాత.. క్రికెట్ మైదానంపై కాదు.. సోషల్ మీడియాలోనే మరింత వేడి రాజేసింది. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి క్వాలిఫయర్-2కి చేరింది. కానీ మ్యాచ్‌పై కాకుండా, ఇద్దరు స్టార్ కెప్టెన్ల ప్రవర్తనపై చర్చ జోరుగా నడిచింది. టాస్ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ముందుకు వచ్చాడు. కానీ గిల్ అతన్ని పట్టించుకోకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయాడు. అంతే కాదు, మ్యాచ్‌లో గిల్ ఔట్ అయినప్పుడు పాండ్యా అతిగా సెలబ్రేట్ చేయడం, గిల్ వైపుగా పరుగెత్తుకుంటూ అరవడం మరింత సందేహాలకు తావిచ్చింది. ఈ రెండు సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

- Advertisement -

దీంతో గిల్ – పాండ్యా మధ్య వ్యక్తిగత విభేదాలున్నాయేమోననే ఊహాగానాలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై తాను స్పందించాల్సిందేననుకుంటూ శుభ్‌మన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో క్లారిటీ ఇచ్చాడు. “పాండ్యాతో నాకు ఎలాంటి విభేదాలు లేవని… తాము మంచి ఫ్రెండ్స్‌మే. మీరు ఇంటర్నెట్‌లో చూసే ప్రతిదాన్నీ నమ్మకండి,” అంటూ ఆయన రాసుకొచ్చాడు. ఈ స్టేట్‌మెంట్‌లో హార్దిక్ పాండ్యాను కూడా ట్యాగ్ చేశాడు. గిల్ వ్యాఖ్యలతో వైరల్ వీడియోల పైనా, వచ్చిన రూమర్లపైనా పుల్ స్టాప్ పడినట్టయ్యింది.

మరోవైపు, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ ప్రయాణాన్ని ముగించగా… ముంబై ఇండియన్స్ ఫైనల్ బెర్త్ కోసం తలపడుతోంది. కానీ అభిమానుల్లో మాత్రం గిల్ – పాండ్యా తీరుపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News