Sunday, October 6, 2024
HomeఆటHyd: దూసుకెళ్తున్న తెలంగాణ సెయిల‌ర్లు

Hyd: దూసుకెళ్తున్న తెలంగాణ సెయిల‌ర్లు

మైసూర్ నేష‌న‌ల్స్‌లో 12 ప‌త‌కాలు సొంతం

తెలంగాణ సెయిల‌ర్లు త‌మ విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నారని తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు దాదీ భోటే తెలిపారు. క‌ర్ణాట‌క‌లోని కృష్ణ‌రాజ సాగ‌ర్ ఆన‌క‌ట్ట వ‌ద్ద నిర్వ‌హించిన మైసూరు నేష‌న‌ల్స్‌లో వీరు మొత్తం 12 ప‌త‌కాలు సాధించారన్నారు. జూనియర్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టాలో ఏ రాష్ట్రం ఇంత‌వ‌ర‌కు ఇన్ని ప‌త‌కాలు సాధించ‌లేదన్నారు. దీక్షిత కొమ‌ర‌వెల్లి 39 మంది మహిళా, పురుష సెయిల‌ర్ల‌లో మూడో స్థానంలో నిలిచిందన్నారు. 45 పాయింట్ల భారీ తేడాతో దీక్షిత బాలికల గోల్డ్ మెడల్ సాధించగా, భోపాల్ కు చెందిన రెండో అమ్మాయి సమృద్ధి బాథమ్ 10వ స్థానంలో నిలిచిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News