Friday, September 20, 2024
HomeఆటIbrahimpatnam: బాక్స్ బాల్ క్రికెట్ ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

Ibrahimpatnam: బాక్స్ బాల్ క్రికెట్ ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి లోని మంగళపల్లి చౌరస్తా కొంగర రోడ్డులో అనుదీప్ రెడ్డి, మనీష్ ఏర్పాటు చేసిన బాక్స్ బాల్ క్రికెట్ గ్రౌండ్, కేఫ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహాదపడతాయని శారీరకంగా మానసికంగా ఉపయోగపడతాయని తెలిపారు.

- Advertisement -

యువకులు స్వయం ఉపాధితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా అయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యమ్ఎన్ఆర్ యువసేన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు టేకుల కమలాకర్ రెడ్డి, నాయకులు మనోజ్ రెడ్డి, రాఖి, పృద్వి నాని, శ్రీధర్ రెడ్డి,ధనరాజ్ శివ గౌడ్, బిట్టు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News