Sunday, October 6, 2024
HomeఆటIllanthakunta: యువత క్రీడల్లో రాణిస్తూ సమాజ సేవలో ముందుండాలి

Illanthakunta: యువత క్రీడల్లో రాణిస్తూ సమాజ సేవలో ముందుండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ తూముకుంట్ల శ్రీలత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీపీ వూట్కూరు వెంకటరమణ రెడ్డి పోటీలను ప్రారంభించారు.

- Advertisement -

జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు,ఎంపీపీ రమణారెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా వారివురు మాట్లాడుతూ యువత శరీర దారుఢ్యం పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యువత సన్మార్గంను ఎంచుకొని ముందుకు ప్రయాణించాలని, చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత క్రీడలతో పాటుగా సమాజ సేవలో ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి,కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర కిష్టయ్య, గూడ నరేందర్ రెడ్డి, తుంకుంట్ల సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి,ఎలుక స్వామి, పోతరాజు చంటి, తీగల నాగయ్య, సాయి, మాజీ వార్డుసభ్యులు, యూత్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News