IND vs AUS: సూర్యకుమార్ యాదవ్ ఫాం లేదని.. ఇప్పుడు ఆడకపోతే కష్టమే అని టాక్ నడుస్తోంది. ఇట్లా అయితే, కెప్టెన్ పోస్టుకు గిల్ ఎసరు పెట్టేస్తారని ఫుల్ ప్రచారం జరిగింది. అయితే, ఇలాంటి టైంలోనే ఐదు టీ20 సిరీస్లో భాగంగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం కాన్బెర్రా వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయ్యింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. తర్వాత కాసేపటికి వాన ఆగిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఆటను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత కాసేపటికి.. సూర్యకుమార్ 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జేవియర్ బ్రేట్లెట్ బౌలింగ్లో (7.3) అతడు ఇచ్చిన క్యాచ్ను జోష్ ఫిలిప్ పట్టుకోలేకపోయాడు. తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన.. గిల్, సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కు 32 బంతుల్లోనే అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు.
Read Also: AUS vs IND: టీమ్ఇండియాకు షాక్: అభిషేక్ శర్మ ఔట్
స్వింగ్ మోడ్ లో
అయితే, టీమిండియా ప్లేయర్లు పుల్ టీ20 స్వింగ్ లోకి మారి వేగంగా పరుగులు చేయాలని చూస్తున్న టైంలోనే మరోసారి 9.4 ఓవర్ల వద్ద వరుణుడు ఆటకు మరోసారి ఆటంకం కలిగించాడు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 97/1గా ఉంది. రెండోసారి మ్యాచ్ ఆగడానికి ముందు నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో (9.3) సూర్యకుమార్ యాదవ్ బ్రిలియంట్ సిక్స్ కొట్టాడు. ఇది అతడికి టీ20ల్లో 150వ సిక్స్. అతడు 86 ఇన్సింగ్స్ల్లో, 1649 బంతులు ఎదుర్కొని ఈ ఘనతను సాధించాడు. ఇక, తర్వాత ఆటను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను అర్ధాంతరంగా ముగించారు. మ్యాచ్ ఆగే సమయానికి శుభ్మన్ గిల్ (37*), సూర్యకుమార్ యాదవ్ (39*) నాటౌట్గా నిలిచారు. రెండో టీ20 మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా.. శుక్రవారం (అక్టోబర్ 31) జరగనుంది.
Read Also: IND vs AUS: వర్షం వల్ల 18 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న..
అయితే, మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక, ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ తనకు దక్కిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో (3.5) అతడు ఫీల్డర్ మీదుగా ఫోర్ కొట్టే ప్రయత్నంలో భాగంగా బంతిని గాల్లోకి లేపాడు. దాన్ని టిమ్డేవిడ్ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో అభిషేక్ 19 పరుగులకు (14 బంతుల్లో, 4 ఫోర్లు) పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ తన తొలి వికెట్ను 35 పరుగుల వద్ద కోల్పోయింది.


