IND vs Eng 1st Test: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 21/0 పరుగుల వద్ద ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. గెలుపే లక్ష్యంగా ఓపెనర్లు బెన్ డకెట్, క్రాలీ తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లను టార్గెట్ చేస్తూ పరుగులు రాబడుతున్నారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 117/0 పరుగులు చేసింది. డకెట్ 64 పరుగులు చేయగా.. క్రాలీ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి మరో 254 పరుగులు కావాలి.
లంబ్ బ్రేక్ తర్వాత టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తేనే మ్యాచులో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇంగ్లీష్ ప్లేయర్లు ఈజీగా టార్గెట్ ఛేజ్ చేస్తారు. ఒక్క వికెట్ పడకపోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు తర్వాత జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ కు రానున్నారు. దీంతో భారత బౌలర్లు విజృంభించక తప్పదు. లేని పక్షంలో చేజేతులా మ్యాచ్ కోల్పోవాల్సి ఉంటుంది. టీ బ్రేక్ సమయానికి మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో తేలిపోనుంది.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు ధాటిగా ఆడిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్(137), పంత్(118) సెంచరీలతో అదరగొట్టారు. అయితే మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారీ టార్గెట్ సెట్ చేయలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రాస్ 3, జోష్ టంగ్ 3, బషీర్ 2, వోక్స్ 1 వికెట్ తీశారు .ఇక 371 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21/0 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.