రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-18(IPL 2025) తుది పోరుకు రంగం సిద్ధమైంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని దక్కించుకోవాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.
పంజాబ్ జట్టు: ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, విజయ్కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
బెంగళూరు జట్టు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టన్, జితేశ్ శర్మ, షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హేజిల్వుడ్